సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ బండి సంజయ్ను శాలువుతో ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఎంపీ అభినందిచారు. ప్రజలకు నిరంతరం తోడు ఉంటూ.. వార్డు అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రి తెలిపారు.