SRD: భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని ద్వారబంధము చేశారు. చంద్రగ్రహణం సందర్భంగా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో స్వామివారికి, అమ్మవారికి అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు.