NRPT: దొంగతనాల నివారణకు ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్లో అనుమానితుల వేలి ముద్రలను ప్రత్యేక పరికరంతో వేలిముద్రలను తనిఖీ చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారి వేలిముద్రలను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా అనుమానాస్పదంగా వస్తువులు, మనుషులు కనిపించిన పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు.