SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ పదవీ విరమణ పొందిన సందర్భంగా ఘనంగా వీడ్కోలు సమావేశం శనివారం జరిగింది. టీఎన్జీఓస్ స్పెషల్ యూనిట్, మినిస్టీరియల్ 4వ తరగతి సిబ్బంది యూనియన్ సభ్యులు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొని ఆలయం తరఫున శ్రీనివాస్కు స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డు ప్రసాదం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.