SDPT: జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో సోమవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పంట వైవిధ్యీకరణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డా. సి.హెచ్. పల్లవి మాట్లాడుతూ.. రైతులు కేవలం వరి, పత్తి పైనే ఆధారపడకుండా మొక్కజొన్న, మినుము, పెసర, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో పాల్గొన్నారు.