MNCL: మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో ఓ వ్యక్తి గురువారం రాత్రి హల్చల్ చేశారు. మహారాష్ట్రకి చెందిన యువకుడు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపైకి ఎక్కి హంగామా సృష్టించాడు. ప్రమాదం జరగకుండా విద్యుత్ సరఫరాను ముందుగానే నిలిపివేశారు. ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడకు చేరుకోగా, పోలీసుల బుజ్జగింపులతో యువకుడు కిందకి వచ్చాడు.