MBNR: హన్వాడ మండలం యారోనిపల్లిలో తిరుమలనాథ రాకమకొండ బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహించనున్నాయి. సర్పంచ్ స్వాతి తిరుపతయ్య తన ఖర్చుతో 3 కిమీ మట్టి రోడ్డుకు మరమ్మత్తులు చేయించింది. బీటీ రోడ్ మంజూరుపై నాయకులు ఎప్పటికీ స్పందించకపోవడం ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది.