SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం ఏర్పాటు చేశారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పోయిన, చోరీకి గురైన సుమారు 6 లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రం లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్లు యజమానులకి అందజేశారు.