కృష్ణా: రైతులకు అవగాహన పెంపొందించేందుకు కిసాన్ గోష్టి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సుధారాణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమం ఎన్. రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటవ్వగా, వరి, మినుము పంటలపై చర్చలు జరిగాయి.