WGL: నర్సంపేట పట్టణంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి మంగళవారం కలకలం రేపింది. పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో పట్టణానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి అనుమానాస్పద నకిలీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.