JN: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో సోమవారం పర్యటించి మాట్లాడారు. నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.