భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా, మణుగూరులో నాగేశ్వరరావు గడ్డిమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.