BHPL: భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా చందుపట్ల కీర్తి రెడ్డిని నియమించినట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి మాట్లాడుతూ.. BJP పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తామని తెలిపింది. తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా, నాయకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.