MHBD: మరిపెడ మండలం భూక్యతండాలో గ్రామసభలో లబ్ధిదారుల జాబితా పరిశీలనలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. 2023-24 సం/ చెందిన నాలుగు కళ్యాణలక్ష్మి చెక్కులు నకిలీధ్రువీకరణ పత్రాలతో పొందినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో రూ.4లక్షలను రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తహసీల్దార్ కృష్ణవేణి సోమవారం తెలిపారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు.