KNR: ఇల్లందకుంటలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఐదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఇల్లందకుంటలో పలువురికి ఇండ్లు మంజూరు కావడంతో సర్పంచ్ దార సురేష్ హాజరై భూమిపూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోందని, పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.