KMR: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మూడో రోజు ఉత్తనూర్ గ్రామ సంఘాన్ని జడ్పీ సీఈఓ చందర్ సందర్శించారు. ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తడి-పొడి చెత్తను వేరుచేసే విధానంపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీఓ సంతోష్ కుమార్ ఉన్నారు.