ADB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చౌహన్ రవి(34)పై పీడీ చట్టం కింద జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు. రవి ఉత్తర తెలంగాణలో 26 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతడిని ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.