PDPL: పెద్దపల్లి టాస్క్ రీజియన్ సెంటర్లో ఇవాళ నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతం అయిందని జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. 380 మంది అభ్యర్థులు పాల్గొనగా 62 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని, మరో 9 మంది షార్ట్ లిస్టు అయినట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఇలాంటి అవకాశాలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.