WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత రెండేళ్లుగా ఆస్తి పన్ను చెల్లించని 19 వేల మొండి బకాయిదారులకు ఆర్పీల ద్వారా అధికారులు రెడ్ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. ఈ నెలాఖరుతో పన్ను చెల్లింపు గడువు ముగుస్తున్న నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు మెప్మా ఆర్పీల సేవలను తీసుకుని బకాయిదారుల ఇంటికి వెళ్లి నోటీసులు అందజేస్తూ సంతకాలు తీసుకుంటున్నారు.