KNR: విద్యుత్ సంస్థల్లో ‘ఒకే సంస్థ ఒకే రూల్ విధానాన్ని’ అమలు చేయాలని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎస్ఈ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ అమలు చేయాలని వారు కోరారు. అన్ మ్యాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు