W.G: పెనుగొండ మండలం చినమల్లంలో రాజమండ్రి ఎన్.జీ. రంగ వ్యవసాయ కళాశాల విద్యార్థులు శనివారం పర్యటించారు. గ్రామీణ విశ్లేషణాత్మక కార్యక్రమంలో భాగంగా రైతుల సమస్యలను, పంట దిగుబడులను అడిగి తెలుసుకున్నారు. రసాయన పురుగుమందుల వాడకం తగ్గించి, సేంద్రీయ వ్యవసాయం చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు.