HNK: గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. పలివెల్పులలో గుడిసె వాసులతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయని, స్థానికంగా కనీస మౌలిక సదుపాయాలు సైతం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.