MNCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సింగరేణి సంస్థలో ముస్లీం ఉద్యోగులకు పండుగ అడ్వాన్స్ చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించింది. రెగ్యులర్ ఉద్యోగులకు రూ.25 వేలు, తాత్కాలిక కార్మికులకు రూ.12, 500 అడ్వాన్స్ కింద ఈ నెల 18న బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ అడ్వాన్స్ ఏప్రిల్ నెల వేతనాల నుంచి 10 సమాన నెలవారీ వాయిదాల్లో రికవరీ కానుంది.