MDK: సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు రావాల్సిన నీటిని స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే ప్రభుత్వం అడ్డుకుంటోందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మార్చి 23న 0.3 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వం జీవో జారీ చేసినా, ఇప్పటి వరకు నీటి విడుదల జరగలేదన్నారు. ఈ సందర్భంగా ఆమె నీటి జాప్యంపై నిరసన తెలిపారు.