MNCL: చెన్నూర్ మండలం కొమ్మెరలో మంగళవారం విద్యుత్ ఘాతంతో జ్యోతి మృతి చెందింది. బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. గతంలోనే తండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు, ఇప్పుడు తల్లి కూడా దూరమవడంతో అనాథలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరతున్నారు.