AP: రాజధాని కోసం అమరావతి రైతులు 30 వేల ఎకరాలు ఇచ్చారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ‘రాజధానికి భూములిచ్చిన రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశాం. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేసే బాధ్యత మాదే. వైసీపీ నేతలు వ్యాఖ్యలు, వైఖరి సరికాదు. చట్టసభలు ఆమోదించిన చట్టాలను గౌరవించబోమని ఎలా అంటారు? చట్టం చేశాక దాన్ని అందరూ అనుసరించాల్సిందే’ అని చెప్పారు.