నెల్లూరు: CM చంద్రబాబు ఏప్రిల్ 1న (బుధవారం) వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, జేసీ పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.