NLR: కలిగిరి మండలం కుమ్మర కుండూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాపర్ల సుబ్బలక్ష్మి రాణి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. గత 37 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించారు.