MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి, వైస్ ఛైర్మన్ మోత్కూరి రాజేశ్వరి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5, 11, 13 వార్డులలో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య సమస్యలు, మంచినీటి సరఫరా లోపాలు, డ్రైనేజీ, నాలాల క్లీనింగ్ పరిశీలించారు.