WGL: గీసుకొం(M)కొమ్మాల జాతరను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం నర్సంపేట మీదుగా వెళ్లే ప్రతి బస్సును కొమ్మాల వద్ద నిలపనున్నట్లు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. జాతర రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. భక్తులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.