ADB: ఉట్నూర్ మండలంలోని నవోదయనగర్కు చెందిన ఆత్రం గంగూబాయి ఇటీవల బిడ్డను జన్మనిచ్చి మరణించింది. ఈమె భర్త గత నాలుగు నెలల క్రితం మృత్యువాత పడడంతో బాధిత చిన్నారి అనాథగా మారింది. దీంతో శుక్రవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చిన్నారికి అండగా ఉంటామని హమీచ్చారు. అదేవిధంగా రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.