NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవం ఉత్సాహంగా సాగింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి బోధన చేస్తూ అలరించారు. పాఠశాల ఛైర్మెన్ పట్ల మౌనిక జనార్ధన్, హెచ్ఎం ఆర్.వెంకన్న, ఉపాధ్యాయుడు బి.యాదయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల ప్రతిభను అందరూ అభినందించారు. ఈ వేడుక విద్యార్థుల్లో బాధ్యతను పెంచినట్లు వారు తెలిపారు.