NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకునేందుకు అనువుగా స్థానిక గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో ఈద్గా వద్ద శుక్రవారం శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులతో ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించారు. పరిసరాల్లోని చెత్తాచెదారాన్ని ఊడ్చి, పిచ్చి మొక్కలను తొలగించారు.