GDWL: ఉపాధి కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతకు చేతివృత్తుల వారికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు కొండంత అండగా నిలుస్తాయి అని ఐపీఓ భాస్కర్ రెడ్డి అనారు. ధరూర్ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో పీఎంఈజీపీ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ రంగాల వారికి లభించే సబ్సిడీలు, దరఖాస్తు విధానంపై వివరించారు.