NRML: భైంసా పట్టణంలో 141 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పంపిణీ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పథకాల లాభాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.