హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హనోయ్ నుంచి కౌలాలంపూర్ మీదుగా వచ్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ ఏషియా AK069 విమానంలో వచ్చిన వారి నుంచి 9.10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ. 3.18 కోట్లు ఉంటుందని అంచానా వేశారు. నిందితులను అరెస్ట్ చేయగా విచారణ కొనసాగుతోంది.