ADB: వరస దొంగతనాలకు పాల్పడుతున్న అందారే సిద్దేశ్వర్ అనే నిందితుడిని ఉట్నూర్ మండలంలోని బస్టాండ్ సమీపంలో సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. పట్టణంలో జరిగిన కొన్ని కీలక కేసులలో నేరస్తుడుగా ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు మూడు దొంగతనాల కేసుల్లో నగదు కాజేసినట్లు పేర్కొన్నారు. ఎస్సైతో పాటు కానిస్టేబుళ్లు నరేష్, తానాజీ, ప్రేమ్, తదితరులు ఉన్నారు.