BDK: చర్ల మండలం ఎంపీడీవో కార్యాలయం శనివారం కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పాల్గొని 45 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏన్నో మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణ లక్ష్మి అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారుల పాల్గొన్నారు.