BDK: మణుగూరు సింగరేణి ఓ.సి.విస్తరణ నిమిత్తం తీర్లాపురం గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించారు. భూసేకరణ అధికారి ఆదేశాల మేరకు భూమికి సంబంధించిన పత్రాల పరిశీలన గత 15 రోజులుగా కొనసాగుతుంది. అయితే సర్వే చేయించుకున్న కొంతమంది వ్యక్తులు తమ భూమి ప్రాంతములో అందుబాటులో లేరని తేలింది. అందుబాటులో లేని వారు 3 రోజుల గడువులోగా రావాలని తాహాసిల్దార్ నరేష్ తెలిపారు.