MNCL: లక్షెట్టిపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో రూ. 3.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఇటిక్యాల చెరువు సుందరీకరణ పనులను ఆయన ప్రారంభించారు. మున్సిపాలిటీ సుందర పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ దొంత అంజలి, తదితరులు ఉన్నారు.