KNR: మానకొండూర్ మండలం ఈదెలగట్టపెల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాయికంటి శ్రీనివాస్ పరిశీలించారు. ఆరు వారాలుగా కూలి డబ్బులు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి, 333 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పనిస్థలాల్లో నీరు, టెంట్, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.