ASF: పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో రంజాన్ పండుగ సందర్భంగా శాంతి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రంజాన్ మాసమును ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ప్రార్థన సమయాలలో ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.