హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం (ఐడీఓసీ)లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. విభిన్న శాఖలకు చెందిన అధికారులు హాజరై వినతులను పరిశీలిస్తూ, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.