NZB: కమ్మర్ పల్లి మండలం వేసవి దృష్ట్యా మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజిఎస్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.