PPM: గొట్టివలస గ్రామ పరిసరాల్లో ఆదివారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా పొలాలకు వెళ్లే వారు, మామిడి తోటలు, జీడి తోటలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. అవసరం లేకుండా ఒంటరిగా వెళ్లకుండా, సమూహాలుగా వెళ్లడం మంచిదని సూచించారు.