E.G: నిడదవోలు పట్టణంలో మెప్మా ఆర్పీలుగా పని చేస్తున్న ఉద్యోగులకు జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్పీల సంఘం ఆధ్వర్యంలో (సీఐటియూ) సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ.. పట్టణంలో మెప్మా ఆర్పీలకు పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.