HYD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని హరీష్ రావు విమర్శించారు. బీసీ డిక్లరేషన్లో చెప్పినట్లుగా ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు హామీ ఇచ్చిన రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.