RR: ఎల్బీనగర్లో TG ఉద్యమకారుల ఫోరం నిర్వహించిన పత్రికా సమావేశంలో నేడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగె విష్ణువర్ధన్ తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ మేనిఫెస్టో హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు.