ADB: తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆడే గజేందర్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.