NLG: మిర్యాలగూడ పట్టణంలో బీసీ జేఏసీ సమావేశంలో, పట్టణ అధ్యక్షులు బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదని అన్నారు. కార్మికులను చర్చలకు పిలిచి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.